• Tue. Feb 4th, 2025

అక్షర న్యూస్ : వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించాలి..

Bypentam swamy

Nov 5, 2024

అక్షర న్యూస్ :అధిక దిగుబడినిచ్చే వరి 27పీ37 పండించి రైతులు అధిక దిగుబడి సాధించి అధిక లాభాలు పొందాలని పయనీర్ సీడ్స్ టీఎస్ఎం అశోక్ రెడ్డి కోరారు. మంగళవారం దౌల్తాబాద్ మండల పరిధిలో గల ఇందుర్ ప్రియల్, రామారం పరిసర ప్రాంతాలలో గల రైతు యాదగిరి పొలంలో కోర్టేవా అగ్రీ సైన్స్ పయనీర్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఘనంగా 27పీ37 రైతు అవగాహన పంట కోత కాల దినోత్సవాన్ని నిర్వహించారు. 

 ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడు తూ.. హైబ్రీడ్ వరి పంటలకు సంబంధించిన యాజమాన్య సూచనలు, మెలుకువలు, సస్యరక్షణ చర్యలు తెలియ చేశారు. కార్యక్రమం లో భాగంగా ఆగ్రోస్ రైతు సేవ కేంద్రం అంజిరెడ్డి , సంగమేశ్వర, ట్రేడర్స్ నాగప్పలు , రైతులు పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. సాంకేతిక యాజమాన్య పద్దతుల గురించి తెలు కున్నారు.

 

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

 రైతుపొలంలో వరి పంట కోసి రైతుల మధ్యలో నూర్పిడి చేసి ఎకరానికి 35క్వింటల్ల దిగుబడి వచ్చిందని అని అంచనా వేశారు. ఇతర రకాలతో పోల్చితే పయోనీర్ 27పీ37 రకంతో ఐదు క్వింటల దిగుబడి వస్తుందని తెలిపారు. రబీ సీజన్లో మొక్కజొన్న పీ3312, పీ3546, పీ3567 సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఎండీ ఆర్ భానుప్రకాష్, నరేష్ పాల్గొన్నారు.

 

 

అక్షర న్యూస్ : శ్రీవాణి స్కూల్లో వసంత పంచమి వేడుకలు..