అక్షర న్యూస్ : రాజీవ్ రహదారి కుంకుమ మిల్లు చౌరస్తా బ్లాక్ స్పాట్ ( తరచుగా ప్రమాదాలు జరిగే ప్రదేశాన్ని) టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, హెచ్ కె ఆర్ బృందం వివిధ డిపార్ట్మెంట్ అధికారులు కలసి సందర్శించారు.ఈ సందర్భంగా సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడమ్ గారి ఆదేశానుసారం, రోడ్డు ప్రమాదాల నివారణ గురించిముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు, మరియు ఎక్కువ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపినారు.
హెచ్ కె ఆర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో
ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, హజ్డాడ్ మార్కర్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్,వేగ నియంత్రణ బోర్డు త్వరలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340116-1024x768.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340114-1024x768.jpg)
![](https://aksharanews.com/wp-content/uploads/2024/11/1000340113-1024x768.jpg)