అక్షర న్యూస్ : సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ చెట్టుక్రింది ముత్యం రాజు, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజులుగా వాహనాలు తనిఖీ చేయగా *40* మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడినారు వారిని ఈ ఐదు రోజులలో *సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి గారి ముందు హాజరుపరచగా విచారణ చేసి 40 మందికి రూ.4,05,500/- జరిమాన విధించినారు.* అలాగే *డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 34 మందికి రూ. 1,65,500/- జరిమానా విధించినారు**ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ చెట్టుక్రింది ముత్యం రాజు మాట్లాడుతూ* ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడుపరాదని త్రాగి వాహనం నడపడం వలన తమ ప్రాణాలకి హాని జరగడమే కాకుండా ఇతరుల ప్రాణాలకి ముప్పు ఉన్నందున, రోడ్డు ప్రమాద రహిత సమాజం కోసం అందరూ బాధ్యత కలిగిన పౌరులుగా మెలగాలని ఒకవేళ మద్యం త్రాగి వాహనం నడుపుతూ పోలీస్ కి పట్టుబడితే రూ. 10,000/- మరియు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పట్టుబడితే రూ. 5,000/- జరిమానా తో పాటు జైలు శిక్ష వంటి చట్టపరమైన కఠిన చర్యలకి భాద్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరించినారు.
అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..
