అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్లలోకి అక్రమ ప్రవేశాలను అరికట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. సరైన టికెట్ లేకుండా రిజర్వుడ్ కోచ్లలో ప్రయాణిస్తే రూ. 2,000 వరకు జరిమానా విధించడంతో పాటు, రిజర్వ్ ప్రయాణికుల మార్గానికి అడ్డంకి కలిగిస్తే మరో రూ. 1,000 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒకవేళ ఈ జరిమానా చెల్లించకపోతే కోర్టు ద్వారా రూ. 3,000 వరకు ఫైన్ పడుతుందని స్పష్టం చేసింది. కాబట్టి జనరల్ టికెట్లు కలిగిన ప్రయాణికులు ఎట్టిపరిస్థితుల్లోనూ రిజర్వేషన్ కోచ్లలోకి రావద్దని రైల్వే అధికారులు తేల్చిచెప్పారు.
అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!
