అక్షర న్యూస్ : హైదరాబాద్ నగరం లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన కీలక మౌలిక వసతు ల ప్రాజెక్టులలో భాగమైన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యా యని రవాణా, హైదరాబాద్ ఇన్- ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మంత్రి అజారుద్దీన్తో కలిసి నూతనంగా రూపుదిద్దుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జితో పాటు తుది దశకు చేరుకున్న మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యు లు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితర ప్రజాప్రతి నిధులు, ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.
సుమారు రూ.680 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆధునిక స్టీల్ బ్రిడ్జి చంచల్గూడ జైలు ప్రాంగణం నుంచి ఓవైసీ ఆస్పత్రి వరకు, అలాగే మరోవైపు చంపాపేట వైపు సులభంగా వెళ్లేలా మెరుగైన కనెక్టివిటీని అందిస్తుంది. అతి త్వరలోనే ఈ వంతెన ను రాష్ట్ర ముఖ్యమం త్రి చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేయనున్న ట్లు మంత్రి స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్టు అందు బాటులోకి వస్తే సైదాబాద్, సంతోష్ నగర్, చంచల్గూడ, చంపాపేట తదితర ప్రాంతాల ప్రజలకు సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాల నుంచి ఉప శమనం లభించడమే కాకుండా ప్రయాణ సమయం గణనీ యంగా తగ్గుతుంది.
