అక్షర న్యూస్ :రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని డాక్టర్ సత్యానంద్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్షాబంధన్ కేవలం రాఖీ కట్టుకునే పండుగ మాత్రమే కాదని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, రక్షణకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని పేర్కొన్నారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు, ప్రతి ఒక్కరూ పరస్పర ప్రేమాభిమానాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు.
ప్రతి అక్కాచెల్లెలు, అన్నదమ్ముల జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విజయాలు నిండాలని కోరుకుంటూ.. ప్రజలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
“ప్రేమకు ప్రతిరూపం రాఖీ..
బంధానికి బలమైన నమ్మకం..
సోదర–సోదరీమణుల అనుబంధం ఎల్లప్పుడూ ఇలాగే చిరస్థాయిగా ఉండాలి.”
— డాక్టర్ సత్యానంద్
అక్షర న్యూస్ : రక్షాబంధన్ సందర్భంగా ప్రజలకు డాక్టర్ సత్యానంద్ శుభాకాంక్షలు..
