అక్షర న్యూస్ :సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అక్షర వెబ్ న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల స్త్రీ మూర్తులందరికీ, సంపూర్ణంగా అమ్మవారి రక్షణతో పాటు, అన్నదమ్ముల రక్షణ లభించాలని కోరుకుంటూ రక్షా బంధన దినోత్సవ శుభాకాంక్షలు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ కేవలం ఒక దారపు బంధం కాదని, జీవితాంతం తోడుగా నిలిచే సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీక అని అన్నారు. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి, ప్రేమాభిమానాలతో అతని సుఖసంతోషాలను కోరుకోవడం.. సోదరుడు తన సోదరికి ఎల్లప్పుడూ అండగా, ఆపన్నహస్తంగా ఉంటానని భరోసా ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయత, సంతోషం, ఐక్యత వెల్లివిరియాలని, సోదర–సోదరీమణుల అనుబంధం మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ రక్షాబంధన్ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు తీసుకురావాలని కోరుకున్నారు.
ప్రజలందరూ రక్షాబంధన్ వేడుకలను ఆనందంగా, ప్రేమానురాగాలతో జరుపుకోవాలని పెంటం స్వామి ఆకాంక్షించారు.
అక్షర న్యూస్ : సోదర–సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్: పెంటం స్వామి
