• Sat. Mar 15th, 2025

అక్షర న్యూస్ : మూసీ ప్రక్షాళన నేపథ్యంలో పాదయాత్రకు ప్రాధాన్యత..

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 8వ తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. మూసీ ప్రక్షాళన నేపథ్యంలో ఆయన పాదయాత్రకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. నవంబరు 8న రేవంత్ రెడ్డి పుట్టినరోజు కాగా.

ఆ రోజున యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనం అనంతరం ఆయన వలిగొండ మండలంలోని మూసీ గ్రామాల్లో పాదయాత్ర చేపట్టనున్నారు.

అక్షర న్యూస్ : సిద్దిపేట లో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు నెరవేరుస్తాడనీ భక్తుల అభిప్రాయం

పాదయాత్ర సమయంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని రైతులు, ప్రజలను రేవంత్ రెడ్డి కలవనున్నారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకోనున్నారు. వారి నుంచి సలహాలు, సూచనలు కూడా స్వీకరిస్తారు. ఈ పాదయాత్రలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొననున్నారు.

అక్షర న్యూస్ : కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు రెవెన్యూ సిబ్బంది మరియు వార్డు ఆఫీసర్ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు..