• Fri. Jan 30th, 2026

అక్షర న్యూస్ : హైదరాబాద్ లో కోటి దీపోత్సవం.. ఎప్పటి నుంచంటే!

Bypentam swamy

Nov 4, 2024

అక్షర న్యూస్ :ఏటా కార్తీక మాసంలో హైదరాబాద్ లో జరిగే కోటి దీపోత్సవ మహాయజ్ఞం ఈ నెల 9న ప్రారంభం కానుంది. నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో ప్రతీ రోజు సాయంత్రం 5.30 గంటలకు నవంబర్‌ 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఎన్టీవీ-భక్తి టీవీ యాజమాన్యం ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

దీపపు కాంతులు, వేద పండితులు, స్వామీజీల ప్రవచనామృతాలు, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణాలు, లింగోద్భవం, కల్యాణ కమనీయాలతో రోజుకో ప్రత్యేక కార్యక్రమంతో వీక్షకులను భక్తి పారవశ్యంలో ముంచెత్తనుంది. ఏటా వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

అక్షర న్యూస్ :17వ వార్డు కౌన్సిలర్ గా టీఆర్ఎస్ అభ్యర్థిగా వడ్లకొండ సుభద్ర శ్రీధర్ ..

శివకేశవులని ఒకే వేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం అని చెప్పారు. ఈ దీపయజ్ఞంలో వివిధ పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనాలు చెబుతారని తెలిపారు.

అక్షర న్యూస్ : జాతీయ నంది పురస్కారం అందుకున్న అరుణారెడ్డిని అభినందించిన హరీష్ రావు..