అక్షర న్యూస్ : హోలీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అక్షర న్యూస్ చీఫ్ ఎడిటర్ పెంటం స్వామి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్య జీవనంలోని కష్టాలను కాసేపు మరిచి, వయోభేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి కేరింతలతో ఆనందోత్సాహాల నడుమ రంగులతో జరుపుకునే ప్రకృతి పండుగ హోలీ అని గుర్తుచేశారు.
ఈ పండుగ భారతీయ సామాజిక, సాంస్కృతిక జీవన ప్రత్యేకతను చాటుతుందని పేర్కొన్నారు. వసంతాన్ని తమ జీవితాల్లోకి ఆహ్వానిస్తూ జరుపుకునే హోలీ పర్వదిన సందర్భంగా ప్రకృతిమాత ప్రజలందరినీ చల్లగా చూడాలని వారు ప్రార్థించారు
.


