• Sat. Feb 14th, 2026

అక్షర న్యూస్ :అనుమానాస్పద స్థితిలో వాటర్ ఆపరేటర్ మృతి ..

Bypentam swamy

Feb 7, 2026

అక్షర న్యూస్ : అనుమానాస్పద స్థితిలో వాటర్ ట్యాంక్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటన సిద్దిపేట పట్టణం లోని లోలెవల్ వాటర్ వర్క్స్ స్టార్ రూమ్ లో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామానికి చెందిన ఒగ్గు రాములు(65) సిద్దిపేట పట్టణంలోని లో లెవెల్ వాటర్ వర్క్ స్టోర్ రూమ్ లో వాటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. రోజులాగే శుక్రవారం రాత్రి కూడా పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో, స్టోర్ రూమ్ లోనే ఉన్న అతన్ని వాటర్ ట్యాంకర్ వచ్చి బలంగా ఢీకొట్టింది. అతను అక్కడికక్కడే చనిపోగా, గమనించిన మరో వర్కర్ పోశయ్య, పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు రాములు మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు, బంధువులకు సమాచారం అందజేశారు. వారు మార్చురి వద్దకు చేరుకొని తమకు తెలియకుండా మృతదేహాన్ని తరలించడంపై అనుమానం వ్యక్తం చేశారు. స్టోర్ రూమ్ లో ఉన్న ట్రాక్టర్ దానంతట అదే వచ్చి రాములు ను ఢీకొట్టడంపై అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని నిరసన తెలిపారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీస్ కి వెళ్లి న్యాయం చేయాలని కోరారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా మృతుడికి భార్య లక్ష్మీ గతంలోనే మరణించగా, కొడుకు శ్రీనివాస్ ఉన్నారు.

అక్షర న్యూస్ : నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..

అక్షర న్యూస్ : 18వ వార్డు అభివృద్ధికి సరైన నాయకుడు – శ్రీరామ్ సరస్వతి నరేందర్*..