అక్షర న్యూస్ :మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అన్న గారిని వారి నివాసంలో మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు పోతుల రాజేందర్ పటేల్, గాండ్ల బాలరాజ్ పటేల్, ఏనుగుల రవికుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మున్నూరు కాపు సామాజిక వర్గ సంక్షేమం కోసం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసే నిబద్ధత గల నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ బలోపేతానికి, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడంలో తామంతా వెన్నంటి ఉండి సహకరిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పటేల్ మాట్లాడుతూ… తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, మున్నూరు కాపుల హక్కుల సాధన కోసం, వారి ఆర్థిక వికాసం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమ నివాసానికి విచ్చేసి శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు పోతుల రాజేందర్ పటేల్, గాండ్ల బాలరాజ్ పటేల్, ఏనుగుల రవికుమార్ పటేల్ మరియు ఇతర ముఖ్య నాయకులకు, అభిమానులకు ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

