అక్షర న్యూస్ :జిల్లా కారాగారం, సిద్దిపేటలో తేదీ 21.06.2026.. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడమైనది. గత పది రోజుల నుండి R.శ్రీనివాస్ గారిచే సాగుతున్న యోగ సాధన సమావేశాలు ఈరోజు ముగింపు దశకు చేరుకున్నాయి. యోగ చేయడం అలవరచుకోవడం వలన మనిషికి యోగ్యత అలవడుతుంది అని తెలియజేస్తూ ఈయొక్క యోగా అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వలన కలిగే ప్రయోజనాలను గూర్చి వివరిస్తూ మనమందరం రోజు క్రమం తప్పకుండా యోగ చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి G. రత్నం గారు, ఉప కారగారాధిపతి వి. వికాస్ గారు సిబ్బంది మరియు ముద్దాయిలు పాల్గొన్నారు.
