అక్షర న్యూస్ :తెలంగాణ రాష్ట్ర టేకేదారుల సంఘం గౌరవ అధ్యక్షులు ఈదారి మల్లేశం ఆధ్వర్యంలో, కామారెడ్డిలోని పర్ణిక హోటల్లో బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ మరియు టేకేదారుల సంఘం ప్రతినిధుల మధ్య కీలక సమావేశం జరిగింది. బీడీ మ్యానుఫ్యాక్చర్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు హితేంద్రభాయ్ ఉపాధ్యాయ, జనరల్ సెక్రెటరీ ధర్మేంద్ర గాంధీ, దేశాయి బీడీ ప్రొడక్షన్ మేనేజర్ లక్ష్మీకాంత్ బాయ్ సమక్షంలో ఈ కమిషన్ అగ్రిమెంట్ ప్రక్రియ ముగిసింది.
ఈ ఒప్పందం ప్రకారం, గతంలో వెయ్యి బీడీలకు టేకేదారులకు వస్తున్న రూ. 22.60 పైసల కమిషన్కు అదనంగా మరో రూ. 6.00 పెంచారు. దీనితో వెయ్యి బీడీలకు టేకేదార్లకు వచ్చే మొత్తం కమిషన్ రూ. 28.60 పైసలుగా ఖరారైంది. ఈ పెంచిన కమిషన్ ధరలు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి వస్తాయని అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు.
ఈ సమావేశంలో హిందూ మజ్దూర్ సభ (HMS) రాష్ట్ర అధ్యక్షులు ఈదారి మల్లేశం, టేకేదారుల సంఘం ఉపాధ్యక్షులు కె. సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి, భూమేష్, నరేష్, రమేష్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. కమిషన్ పెంపుపై టేకేదారుల సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


