అక్షర న్యూస్ : ఎమ్మెల్యే తర్వాత అంతటి ప్రాధాన్యత గల పోస్ట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి, ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ చైర్మెన్ పదవి కాలంఈ నెల లోనే ముగియనుంది, ఈ క్రమంలో నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ఏర్పా టు చేసేందుకు అధి కారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
దీంతో ప్రధానంగా మంథని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ పదవి భర్తీపై రాజకీయవర్గాల్లో చర్చకొనసాగుతోంది. ఇటీవల మంథని మండలంలోని గుంజ పడుగు గ్రామానికి చెందిన మిటుకు రామ్మూర్తికి వ్యవసా య మార్కెట్ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి,
మిటుకు రామ్మూర్తి కుటుంబం దళిత సామాజిక వర్గానికి చెందినది కాగా.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పని చేస్తున్నాడు, దివంగత నేత మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు,తోపాటు ఆయన కుమారుడైన ప్రస్తుత మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నిరం తరం కృషి చేస్తున్న నాయకుడిగా రామ్మూర్తికి మంచి గుర్తింపు ఉంది.
మిటుకు రామ్మూర్తి, ఎస్సీ మాదిగ సామా జిక వర్గానికి చెందిన నాయకుడని, మంథ ని నియోజకవర్గంలో ఆ వర్గం కాంగ్రెస్ పార్టీ కి బలమైన అండగా నిలుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు తగిన నామినేటెడ్ పదవు లు ఇప్పటి వరకు సామాజిక వర్గానికి దక్కలేదని నిరాశకు లోనవుతున్నారు.
ఈసారి పీఏసీఎస్ చైర్మన్ పదవిని మిటుకు రామ్మూర్తికి కేటాయిస్తే దళిత సామాజిక వర్గానికి న్యాయం చేకూరు తుందని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు అభిప్రాయపడుతున్నారు. చైర్మన్ పదవి కి మిటుకు రామ్మూర్తి సరైన వాడని కాంగ్రెస్ కార్యకర్తలు ఆశా భావంతో ఉన్నారు.
అయితే మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవిపై మరి కొంతమంది నాయకు లు ఆశ పడుతున్న ట్లు తెలుస్తుంది, వీరు కూడా ఎలాగైనా చైర్మన్ పదవి దక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నా రని,సమాచారం. దీంతో మంథని పట్టణ,నియోజకవ ర్గం మండలాల్లోని ప్రజలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని జోరుగా చర్చించు కుంటున్నారు.
