అక్షర న్యూస్ :ఓయూ ఎలక్ట్రికల్ విభాగంలో గ్యాదరి బలరాంకు డాక్టరేట్
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థి, సిద్దిపేటకు చెందిన గ్యాదరి బలరాంకు డాక్టరేట్ (పీహెచ్డీ) వరించింది. యూనివర్సిటీ అధికారులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
శాతవాహన యూనివర్సిటీ రిజిస్ట్రార్ మరియు ఓయూ ఎలక్ట్రికల్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పి. సతీష్ కుమార్ పర్యవేక్షణలో బలరాం తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన “హార్మోనిక్స్ రిడక్షన్ అండ్ బ్యాలెన్స్డ్ ఫేజ్ ట్రాన్సిషన్ ఇన్ హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఇన్ ఏ మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్” అనే అంశంపై సమర్పించిన ప్రతిభావంతమైన పరిశోధనా గ్రంథానికి గాను ఓయూ డాక్టరేట్ ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా పీహెచ్డీ సాధించిన గ్యాదరి బలరాంను పలువురు అధ్యాపకులు, తోటి విద్యార్థులు ఘనంగా అభినందించారు. ఎలక్ట్రికల్ విభాగం హెచ్ఓడీ ప్రొఫెసర్ సుశీల, బీఓఎస్ చైర్మన్ ప్రొఫెసర్ మంగు, ఇతర ప్రొఫెసర్లు ఏసురత్నం, మల్లేశం, విద్యాసాగర్, శిరీష, రమణ తదితరులు బలరాంకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో ఆయన ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.
అక్షర న్యూస్ :మైక్రో గ్రిడ్ పవర్ సిస్టమ్స్పై పరిశోధన: గ్యాదరి బలరాంకు డాక్టరేట్ ప్రదానం..
