అక్షర న్యూస్:సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతరను పురస్కరించుకుని, భక్తుల సౌకర్యార్థం చేపట్టిన భద్రతా ఏర్పాట్లను సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్రీమతి ఎస్. రష్మీ పెరుమాల్, ఐపీఎస్ గారు ఆదివారం తనిఖీ చేశారు.
ఈ పర్యటనలో భాగంగా కమిషనర్ గారు ఒగ్గు పూజారులతో మాట్లాడి, ఆలయ విశిష్టతను మరియు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు మరియు భద్రతా చర్యలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు:
* క్యూ లైన్ల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
* సిసిటివి కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, అలాగే వాహనాల రద్దీ పెరగకుండా పార్కింగ్ మరియు ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి సారించాలని సూచించారు.
* విధుల్లో ఉన్న పోలీసులు భక్తులతో సమన్వయంతో ఉంటూ, జాతర ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషనర్ గారు పేర్కొన్నారు.
*
ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి ( ఎ ఆర్ ) సుభాష్ చంద్రబోస్, గజ్వేల్ ఏసిపి నర్సింలు , స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోతు రమేష్ , ఎస్ఐ మహేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
.


