• Sat. Jan 31st, 2026

అక్షర న్యూస్: శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు..

Bypentam swamy

Nov 14, 2025

అక్షర న్యూస్: శ్రీవాణి స్కూల్లో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు. శ్రీ వాణి స్కూల్ భారత్ నగర్ సిద్దిపేటలో ముందస్తుగా బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా గురువారం రోజున జరిగాయి. విద్యార్థినీ విద్యార్థులు నెహ్రూ , భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు ,ఝాన్సీ లక్ష్మీబాయి వేషధారణలో ఆకట్టుకున్నారు. సుమారు 240 విద్యార్థిని ,విద్యార్థుల చేత నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సి .హెచ్. సత్యం మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుంచి మా పాఠశాలను బాలాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని, దేశానికి మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన జన్మదిన వేడుకలు బాలల దినోత్సవంగా జరుపుకుంటామని. ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బాలలదినోత్సవo సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మన చిన్నప్పుడు చేసిన అల్లర్లు, జ్ఞాపకాలను మరవలేమని గుర్తు చేశారు. చదువుతోపాటు , కళలు, ఆటలు మా పాఠశాలలో ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తామని, విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

అక్షర న్యూస్ :దుబ్బాక BRS అధ్యక్షుడు పల్లె వంశీకృష్ణ గౌడ్ భారతీయ జనతా పార్టీ లో చేరారు..

అక్షర న్యూస్ : 17వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కంచర్ల శివకుమార్ నామినేషన్..