అక్షర న్యూస్ : మండల కేంద్రంలో చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కే. హైమవతి.
కలెక్టర్ పాయింట్స్:
చేర్యాల, కొమురవెళ్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల లబ్ధిదారులకు 636 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి..
రేపటి నుండే ఇండ్ల నిర్మాణం చేపట్టి మూడు నెలల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి.
ఇంటి నిర్మాణ ప్రగతిని బట్టి వారం పది రోజులకు ఒకసారి బిల్లులు మంజూరు అవుతాయి..
ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరికి విధిగా ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది..
*ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్:*
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గ నికి 3000 ఇండ్లు మంజూరు చేశారు..
జులై 14న మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి నూతన రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు…
రైతుల భూ సమస్యలను భూభారతి ద్వార శాశ్వత పరిష్కారం చేయడానికి రెవెన్యూ అధికారులను సంప్రదించాలి..
మండలంలోని పలు గ్రామాల్లో అసలైన లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి..
చేర్యాల పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ అయ్యేలా ముఖ్యమంత్రి దృష్టికి మరియు రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లి డివిజన్ అయ్యేలా చేస్తా..
ఇందిరమ్మ ఇంటిని మొదట పూర్తి చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి వచ్చి స్వంత ఖర్చులతో గృహ ప్రవేశం చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, హౌసింగ్ పీడీ దామోదర్ రావు, సిద్దిపేట ఆర్డీవో సదానందం, జెడ్పిసిఓ రమేష్, మండల స్పెషల్ ఆఫీసర్ ఏడి గ్రౌండ్ వాటర్ నాగరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
