అక్షర న్యూస్ : ఏఆర్ కానిస్టేబుల్ నుండి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ పొందిన ముగ్గురు
1 మల్లికార్జున్, 2 రమేష్, 3 శ్రీనివాస్, ఈరోజు మర్యాదపూర్వకంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారిని కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ పోలీస్ శాఖలో పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు, పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు లభిస్తాయని తెలియజేశారు,
హెడ్ కానిస్టేబుల్ గా ప్రమోషన్ రావడంతో ఆనందం వ్యక్తం చేసి ఉన్నత అధికారులకు ధన్యవాదలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, రాష్ట్ర పోలీసు సంఘం ఉపాధ్యక్షులు రవీందర్ రెడ్డి పాల్గొన్నా
రు.