• Wed. Feb 5th, 2025

ఉపాధ్యాయురాలిగా ఎంపికై న చెవ్వ భారతి రఘు యాదవ్ ని సన్మానించిన అఖిలపక్షం నేతలు

Bypentam swamy

Oct 10, 2024

వనపర్తి బ్యూరో అక్టోబర్ 10

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

జగత్ పల్లి గ్రామానికి చెందిన శివ భారతిని గురువారం వనపర్తి జిల్లా అఖిలపక్షం నేతలు ఘనంగా సన్మానించారు జిల్లా కేంద్రంలోని ఏడవ వార్డు పీర్లగుట్ట దగ్గర నివసించే నక్కరఘు సతీమణి భారతి డి.ఎస్సి ఎస్. జి. టీ పోస్టులో సెలెక్ట్ అయ్యి బుధవారం తెలంగాణ ప్రభుత్వం అందించిన నియామక పత్రాన్ని అందుకున్నారు ఉపాధ్యాయురాలు కాబోతున్నందుకు వారి ఇంటికి వెళ్లి ఆమెను ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఇటీవల డీఎస్సీలో డిస్టిక్ ఏడవ రాంక్ సాధించిన భారతి కి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, అలాగే వనపర్తి జిల్లాలో డీఎస్సీలో సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలు అందుకున్న అందరికీ ఈ సన్మానం ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కొత్త గొల్లశంకర్, బీసీ సంఘం నాయకులు గౌనికాడి యాదయ్య, నాయి బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు అశ్విని రమేష్, శివకుమార్, రమేష్, రాములు,వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.*

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..