• Thu. Apr 23rd, 2026

అక్షర న్యూస్ : సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా రైతులతో వరి ధాన్యం పై చర్చలు..

Bypentam swamy

Apr 23, 2026

అక్షర న్యూస్: జిల్లాలో వరి ధాన్యాన్ని వ్యవసాయ క్షేత్రాల వద్ద తేమ శాతం తగ్గే వరకు ఆరబెట్టిన తర్వాతనే ప్రభుత్వ వరి ధాన్య కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి జిల్లా రైతులకు విజ్ఞప్తి చేశారు.

గురువారం నంగునూరు మండలం పాలమాకుల మరియు
చిన్నకోడూర్ మండలం గోనెపల్లి, పెద్ద కోడూరు గ్రామంలో గల వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….

అక్షర న్యూస్ : సిద్దిపేట ఓయూ పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ఛత్రపతియాదవ్..

రైతులు వరి కోత చేయగానే కొనుగోలు కేంద్రానికి కాకుండా వ్యవసాయ క్షేత్రాల వద్దనే తేమ శాతం వచ్చే వరకు అరబెట్టుకుని కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అలాగే సెంటర్ సిబ్బంది పై సమాచారాన్ని గ్రామాల్లోని ప్రతి ఒక్క రైతుకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కేంద్రాల్లో గన్ని బ్యాగ్ లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, కంఠాల, పాడి క్లీనర్లు, వేసవి కాలం దృష్టా కుండలో తాగునీటి వసతి, అకాల వర్షాలు వల్ల ధాన్యం తడవకుండా టార్ఫలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. తేమశాతం చెక్ చేసి తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

కేంద్రానికి కేటాయించిన మిల్లులలో ధాన్యం దిగుమతి లో జాప్యం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే అకాల వర్షాలు పడే ఆస్కారం ఉందని రాత్రి వేళల్లో ధాన్యంపైన టర్పాలిన్ కవర్లు తప్పనిసరిగా కప్పి ఉంచాలని రైతులకు సూచించారు.

అక్షర న్యూస్ : మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం..