అక్షర న్యూస్ :
ఉస్మానియా విశ్వవిద్యాలయం సిద్దిపేటలోని పీజీ కళాశాల ప్రిన్సిపాల్ గా డా. ఆర్.ఛత్రపతి యాదవ్ నియమితులయ్యారు.
మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగానికి చెందిన డా. ఆర్.ఛత్రపతి యాదవ్ సిద్దిపేట పీజీ కళాశాలలో 2013 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలోని మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం విభాగంలో పీజీ, పీహెచ్ డీ పూర్తి చేశారు. పలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెమినార్లల్లోనూ పాల్గొని తన పరిశోధన పత్రాలను సమర్పించారు.
అనంతరం దశాబ్దంన్నర కాలం పాటు డా.ఛత్రపతి యాదవ్ ప్రముఖ ఓ ఆంగ్ల దినపత్రికలో వివిధ హోదాలలో పని చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం.కుమార్ గారు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి గారు, ఓఎస్డీ టూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ గారు, ఓయూ పీజీ కాలేజేస్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు గురువారం డా. ఆర్.ఛత్రపతి యాదవ్ ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు.
