అక్షర న్యూస్ :ప్రతి ఒక్క విద్యార్థి తమలోనీ నైపుణ్యాలను గ్రహించి విద్యా మరియు ఎంచుకున్న రంగం లో ఉపాధి అవకాశాలను సాధించి ఉన్నతంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు.
శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ సంక్షేమ శాఖల విద్యార్థులకు జిల్లా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి పథకాలపైన జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక రోజు శిక్షణ తరగతులను నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ ప్రక్రియలో భాగంగా సంక్షేమ వారోత్సవాలలో నేడు యువత కోసం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, వారిలో ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందని తెలిపారు.
జిల్లాలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంక్షేమ గురుకులాల్లో విద్యను అభ్యసిస్తున్న మీరందరూ ఈ నైపుణ్య అవగాహన సదస్సులో 10వ తరగతి తర్వాత ఏది చదవాలి తొందరగా ఉపాధి కల్పించడానికి ఎలాంటి నైపుణ్యాలను అలవర్చుకోవాలని పూర్తి సమాచారాలను ఇక్కడ మీకు అందించడం జరుగుతుందనీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో సిద్దిపేట, కుకునూరు పల్లి, దుబ్బాక లో ఐటిఐ లలో నేటి యువతకు ఉపాధి అందించేందుకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ప్రారంభించి కొత్త కోర్సులను తీసుకువచ్చింది కొత్తగా హుస్నాబాద్ లో సైతం ఐ టి ఐ సెంటర్ మంజూరు అయిందని వచ్చే అకడమిక్ ఇయర్ వరకు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో చేరడం ద్వారా తక్కువ సమయంలో మంచి ఉపాధి పొందవచ్చని ఇందులో ఇంజనీరింగ్ వాళ్లకు లేనన్ని ఉపాధి అవకాశాలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలోను విద్యార్థులకు లభిస్తాయని సూచించారు.
10 వ తరగతి తర్వాత ఇంటర్ డిగ్రీ లాంటి కోర్సులు కాకుండా నైపుణ్య రంగంలో త్వరగా ఉపాధి కల్పించుకోవడం కోసం అనేక కోర్సులు ఉన్నాయని, ఉద్యోగ అవకాశాలు తోపాటు పై చదువులు చదువుకునేందుకు సైతం ఈ కార్యక్రమంలో క్లుప్తంగా తెలుసుకోవాలని సూచించారు.
టెక్నికల్ స్కిల్స్ నేర్చుకుని పట్టణాల్లో సైతం పలు కోర్సులు పూర్తిచేసి ఉపాధి పొందవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగరాజమ్మ, డిఆర్డిఓ జయదేవ్ ఆర్య, జిఎం ఇండస్ట్రీస్ గణేష్ రామ్, డిడబ్ల్యుఓ శారద, డిబిసిడిఓ సయ్యద్ రఫీ, డిఎస్సీడిఓ హమీద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి విజయ్ భార్గవ్, ఇర్కోడ్ ఐటిఐ కళాశాల ప్రిన్సిపల్ రామానుజ, అడిషనల్ డిఆర్డీఓ సుధీర్, తదితరులు పాల్గొన్నారు.

