అక్షర న్యూస్ : దుబ్బాక పట్టణంలోని 18వ వార్డును అభివృద్ధి చేసే నిజమైన వ్యక్తి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారికే ఓటు వేయాలని కోరుతూ,దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు,
చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగళరావు గారు
18వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
కాంగ్రెస్ పార్టీతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని,ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న నాయకుడు శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా *శ్రీనివాస్ రెడ్డి* గారు మాట్లాడుతూ –గత పాలకులు 18వ వార్డు అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని,మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు వంటి సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
“డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు…ప్రజాసేవ చేయడానికే వచ్చాం…వార్డు అభివృద్ధే మా లక్ష్యం, మా తపన” అని ఆయన స్పష్టంగా తెలిపారు.అందుకే ప్రజలు ఆలోచించి,చేతి గుర్తుపై ఓటు వేసి శ్రీరామ్ సరస్వతి నరేందర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించి,
18వ వార్డు అభివృద్ధికి సహకరించాలని కోరారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఓటర్లు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..


