అక్షర న్యూస్ : మొదటి రోజు దుబ్బాక పట్టణంలో 17వ వార్డులో దూసుకెళ్లిన ఇంటింటి ప్రచారం..
దుబ్బాక మున్సిపాలిటీ కేంద్రంలోని 17వ వార్డులో మంగళవారం రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు బలపరచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంచర్ల శివ కుమార్ గారి ఆధ్వర్యంలో ఓట్లను అభ్యర్థిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది..
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు ,సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ,ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, సన్న వడ్లు కి 500 బోనస్ , రైతు భరోసా, రైతు రుణమాఫీ,మహిళలకు వడ్డీలేని రుణాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం తో ప్రత్యేక పథకాల అమలు ,మహిళలకు ఇందిరమ్మ చీరలు ,ఉద్యోగాల భర్తీ తదితర పథకాలను వివరిస్తూ తనని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…



