అక్షర న్యూస్ : దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మంగళవారం రోజున *18వ వార్డులో* కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించరు..
ఈనెల 11 న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిని శ్రీరాం సరస్వతి నరేందర్* ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ప్రతి ఒక్క ఓటర్ ను విజ్ఞప్తి చేశాను..ఈ సందర్భంగా
18వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శ్రీరాం సరస్వతి నరేందర్
గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను గడపగడపకు తెలియజేస్తూ వార్డు అభివృద్ధి కోసం నిత్యం కష్టపడి నాయకులను ఎన్నుకోవాలని ఓటర్ మహాశయులను కోరడం జరిగింది..
ప్రజా పాలన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇళ్లు ,సన్న బియ్యం,రేషన్ కార్డులు పంపిణీ,ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్,500 కి గ్యాస్, సన్న వడ్లు కి 500 బోనస్ , రైతు భరోసా, రైతు రుణమాఫీ,మహిళలకు వడ్డీలేని రుణాలు, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం తో ప్రత్యేక పథకాల అమలు ,మహిళలకు ఇందిరమ్మ చీరలు ,ఉద్యోగాల భర్తీ తదితర పథకాలను వివరిస్తూ తనని గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు*..
మీ అమూల్యమైన ఓటును చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో శ్రీరాం సరస్వతి నరేందర్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..




