అక్షర న్యూస్ : ఉదయాన్నే పట్టణంలోని మూడవ వార్డులో పారిశుద్ధ్య పనులను పరిశీలించడం జరిగింది. రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద ఉన్నటువంటి పెట్రోల్ బంక్ పక్కన చెత్తను కాల్చివేయడం గమనించి వెంటనే వాహనాన్ని నిలిపి పెట్రోల్ బంక్ వారిని పిలిచి మంటలు పెట్రోల్ బంకు వద్దకు వ్యాపించినట్లయితే పెండు ప్రమాదం వాటిలుతుందని బంకు నిర్వాహకులకు జరిమానా విధించాలని సిబ్బందిని ఆదేశించారు. రంగధాంపల్లి హనుమాన్ దేవాలయం నుండి శ్రీ చైతన్య పాఠశాల వరకు ఉన్నటువంటి మురుగు కాలువలో సిల్ట్ తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మచ్చవాని కుంట వద్ద విద్యుత్ దీపాలు వెలుగుతూ ఉండడం గమనించి తప్పనిసరిగా ప్రతిరోజు సాయంత్రం విద్యుత్ దీపాలు ఆన్ ఉదయాన్నే సమయానికి ఆఫ్ అయ్యాయా లేదా పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.
✓అనంతరం కోమటి చెరువు పై ప్రకటించడం జరిగింది. నెక్లెస్ రోడ్డు వద్ద ఉన్నటువంటి మొక్కల కుండీలలో ఎండిపోయిన మొక్క స్థానంలో నూతన మొక్క నాటాలన్నారు. కోమటి చెరువు సందర్శనార్థం వచ్చిన సందర్శకులు తినుబండారాల కవర్లు, వాటర్ బాటిల్ మున్సిపల్ వారి ఏర్పాటు చేసినటువంటి చెత్త డబ్బాలో మాత్రమే వేయాలని బహిరంగ ప్రాంతాల్లో వేయకూడదని కమిషనర్ సూచించారు. నెక్లెస్ రోడ్డులో నాటినటువంటి మొక్కలకు తప్పనిసరిగా నీరు ఉండేలా చూడాలని ఆదేశించారు. నెక్లెస్ రోడ్డు వెనుకవైపున రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గమనించి పోలీస్ శాఖ వారికి పెట్రోలింగ్ చేయాల్సిందిగా రాతపూర్వక ఉత్తరం అందజేయాలని సిబ్బందికి ఆదేశించారు.
✓నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలు లోపలికి రాకుండా చూడాలని లేదంటే వాహనాలు రావడం వలన పార్కింగ్ టైల్స్ పాడవతాయన్నారు. నీటి ప్రవాహం లేనందున పాకురు ఉన్న ప్రాంతంలో బ్లీచింగ్ వేసి శుభ్రం చేయాలని ఆదేశించారు. డైనోసార్ పార్క్ వద్ద నాటినటువంటి మొక్కలను పర్యవేక్షించాలన్నారు. అనంతరం పట్టణంలోని 11 మరియు 32 వార్డులలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన చైర్ పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు గారు,వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు గారు,కమిషనర్ అశ్రిత్ కుమార్ గారు,దాసరి భాగ్యలక్ష్మి శ్రీనివాస్, బందారం శ్రీలత రాజు (కౌన్సిలర్ ) గార్లు, శ్రీనాథ్ (AEE) గారు.

