అక్షర న్యూస్ :ప్రజల సెన్సాఫ్ సెక్యూరిటీ గురించి మరియు గంజాయి ఇతర మత్తుపదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించడం జరిగింది..
ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరావు మాట్లాడుతూ పోలీస్ కమిషనర్ మేడం గారి ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలో ఉన్న పాన్ షాప్స్ బస్టాండ్ మరియు అనుమానాస్పద ప్రదేశాలలో డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల గురించి నార్కోటిక్ డాగ్స్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు.
గంజాయి ఇతర మత్తు పదార్థాలు మరియు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా లేక అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.



