అక్షర న్యూస్ :టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని నంద్యాల పోలీసులను హైకోర్టు ఆదేశించింది. కేసు వివరాల్లోకి వెళ్తే… ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎన్నికల సమయంలో సెక్షన్ 144 అమల్లో ఉండగా.అనుమతులు లేకుండా అల్లు అర్జున్ జన సమీకరణ చేశారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ఈరోజు తుది తీర్పును వెలువరించింది.