• Wed. Feb 5th, 2025

అక్షర న్యూస్ : ఈనెల 29న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం..

Bypentam swamy

Dec 20, 2024

అక్షర న్యూస్ : ఈనెల 29న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం మరియు జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి, పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ మరియు జిల్లా అధికారులతో కలిసి కళ్యాణం జరిగే తోట బావి, విఐపి దర్శనము, శీఘ్రదర్శనము,సాధారణ దర్శనము వీఐపీ పార్కింగ్, జనరల్ పార్కింగ్,

బస్టాండ్,ఎల్లమ్మ టెంపుల్, నూతనంగా నిర్మిస్తున్న 50 గదుల సత్రాన్ని నూతనంగా నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవనాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 

 

చేర్యాల, హైదరాబాద్, కరీంనగర్ సిద్దిపేట, బస్సులు ఆటోలు వెళ్లే రూట్ లను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ స్వామివారి కళ్యాణం జరిగే తోటబావి వద్ద విఐపి దర్శనము సాధారణ దర్శనం గురించి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, బారికెట్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని కళ్యాణం జరిగే ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. 

 

ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు లైటింగ్ గురించి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలని లైటింగ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవద్దని ప్రజలకు ఇబ్బంది కలిగించే ట్రాన్స్ఫారంకు చుట్టూ ఫినిషింగ్ ఏర్పాటు చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు.  

 

అక్షర న్యూస్ : శ్రీ సిద్దేశ్వర మహారాజ్ గారి ఆధ్వర్యంలో ధ్యాన మందిరం భూమి పూజ..

ఫైర్ సేఫ్టీ గురించి షాప్ యజమానులకు అవగాహన కల్పించాలని రాబోవు మూడు నెలలు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి విఐపి పార్కింగ్లో తగు ఏర్పాటు చేయాలి ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలి తెలిపారు షాప్స్ ముందర దుకాణాలు పెట్టి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా పెయింటింగ్ వేయించాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు. సూచించారు వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం 24X7 కల్పించాలని ఆర్డబ్ల్యూ అధికారులకు సూచించారు.

 

టెంపుల్ కు ఇరువైపులా స్టాప్ గేట్స్ ఏర్పాటు చేయాలని టెంపుల్ ఈఓకు సూచించారు. వచ్చే భక్తులకు మెడికల్ ఎమర్జెన్సీ గురించి తాత్కాలికంగా స్టాల్స్ ఏర్పాటుచేసి మందులు అందుబాటులో ఉంచుకోవాలని డిఎంహెచ్ఓ కు సూచించారు.సౌండ్ సిస్టం ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఐ& పి డిపార్ట్మెంట్ కు సూచించారు. వచ్చే ఆర్టీసీ బస్సులను బస్టాండ్ లో నిలిపే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు.

 

వచ్చే భక్తుల గురించి మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. వచ్చే భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు 25 తారీకు లోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు.

 

ఈనెల 29 శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవం, మరియు జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద ఎత్తున జాతరకు వచ్చే వారి గురించి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు.

అక్షర న్యూస్ : వసంత పంచమి.. భక్తజనసంద్రంగా మహాకుంభమేళ..

 

పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ మాట్లాడుతూ ఈనెల 29న శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవానికి మరియు జనవరి 19 నుండి జరిగే బ్రహ్మోత్సవాలకు ఏక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

 

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, డిఆర్ఓ నాగరాజమ్మ, ఆలయ ఇఓ బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మల్లికార్జున్, విద్యుత్ శాఖ ఎస్ఇ చంద్రమోహన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి దేవకీదేవి, ఎక్స్భైజ్ సూపరింటిండెంట్ శ్రీనివాసమూర్తి, హుస్నాబాద్ ఏసిపి సతీష్, డీపీఆర్ఓ రవికుమార్, పీఆర్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి, ఐ& పీఆర్ డిఇ భూపాల్ రెడ్డి, చేర్యాల సిఐ శ్రీను, కొమురవెల్లి ఎస్ఐ రాజు, ఆర్&బి డిఇ వెంకటేష్, ఆర్డబ్ల్యూఎస్, ఎండోమెంట్, అగ్నిమాపక తదితర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.