అక్షర న్యూస్ : మహబూబాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 20వ వార్డు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ఈ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని బరిలోకి దిగుతున్నారు.
విద్యావంతురాలిగా గుర్తింపు పొందిన తేజస్వినికి రాజకీయ కుటుంబ నేపథ్యం ప్రధాన బలంగా మారిందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల తొర్రూరు మండలం మడిపెల్లి గ్రామానికి చెందిన మేనత్త కుమారుడితో వివాహం చేసుకున్న తేజస్విని, ప్రస్తుతం రాజకీయంగా క్రియాశీలకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. మానుకోట మున్సిపల్ చైర్మన్ గిరిపై నేరుగా పోటీగా ఈ వార్డును బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. యువత, మహిళల మద్దతు తనకు ఉందని తేజస్విని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ప్రచారంలో పేర్కొంటున్నారు. ఇదే వార్డులో బీఆర్ఎస్ నుంచి మేస్త్రి శంకర్, కాంగ్రెస్ నుంచి విద్యావంతులు, కాకతీయ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు, గిరిజన ఉద్యమ నేత, గతంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మూడ్ బాలు చౌహన్, హత్తిరం అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 11వ వార్డు నుంచి బూక్య నెహ్రు నాయక్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకపోయినా, 20, 15, 17 వార్డుల్లో నామినేషన్ వేసిన మూడ్ బాలు చౌహన్నే చైర్మన్ అభ్యర్థిగా ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలతో మహబూబాబాద్ మున్సిపల్ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి.
