అక్షర న్యూస్ : ఏపీలో ప్రజలతో నేరుగా మాట్లాడాలని సీఎం చంద్ర బాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 1995-2004 మధ్య డయల్ యువర్ సీఎం కార్యక్రమం నిర్వహించగా,అదే తరహాలో సంక్రాంతి నుంచి ప్రజలతో మీ ముఖ్యమంత్రి కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిని ఆడియో/వీడియో విధానంలో ఎలా చేయాలన్న దానిపై అధికారులతో సీఎం సమాలోచనలు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.


