అక్షర న్యూస్ : ప్రమాదాలకు గురి చేస్తున్న మాంజాదారాల అమ్మడం నిషేధించడం జరిగిందని, జిల్లాలో మాంజాదారాలను అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే. హైమావతి ఒక ప్రకటనలో హెచ్చరించారు. గాలిపటాలను ఎగురవేయడానికి సాధారణ దారాలకు బదులుగా మాంజాదారాలు ఉపయోగించడం మూలంగా ఆధారాలు తగిలి తరచుగా వివిధ ప్రాంతాలలో వాహనదారులు, పశువులు, పక్షులు ప్రమాదాలకు గురి కావడం జరుగుతుందని ఇలాంటి సంఘటనలు జిల్లాలో జరగకుండా జిల్లాలోని వ్యాపారులు జిల్లావ్యాప్తంగా ఎక్కడ కూడా మాంజా ధరలను విక్రయించరాదని అన్నారు. ఆదేశాలను పాటించకుండా మంజాదారాలను అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్లు హెచ్చరించారు. అలాగే అధికారులు జిల్లా వ్యాప్తంగా మాంజాదారాలు అమ్మకుండా నిగా పెట్టాలని సూచించారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట జిల్లా వారిచే జారీ చేయనైనది.
