• Mon. May 11th, 2026

అక్షర న్యూస్ : ఏసీబీకి పట్టుబడ్డ మహబూబ్ నగర్ డిఇఓ రవీందర్..

Bypentam swamy

Nov 7, 2024

అక్షర న్యూస్ :మహబూబ్ నగర్ జిల్లా డీఈవో రవీందర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక ఉపాధ్యాయుడికి దక్కవలసిన సీనియారిటీ దక్కకపోవడంతో తనకు న్యాయం చేయాలని పలుమార్లు డీఈఓకు విజ్ఞప్తి చేశారు. 50,000 లంచం డిమాండ్ చేయడంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ ను ఆశ్రయించారు.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

పథకం ప్రకారం గురువారం ఉదయం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీలో ఉన్న డీఈవో ఇంటికి వెళ్లి 50 వేల రూపాయలు ఇస్తుండగా డీఎస్పీ కృష్ణ గౌడ్ బృందం డీఈఓను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు…

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్