అక్షర న్యూస్ : తెలంగాణ, జిల్లా ప్రజలకు సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు దీపావళి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చీకటిని పారద్రోలి వెలుగునిచ్చే దీపావళి పర్వదినం ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి అని ఆకాంక్షించారు. ఈ పర్వదినాన్ని వేడుకగా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని. చిన్నపిల్లలు కాకరొత్తులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ లక్ష్మీనారాయణుని అనుగ్రహముతో అందరికి శుభం చేకూరాలని, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.


