అక్షర న్యూస్ : శ్రీ మహంకాళి మాతేశ్వరి భారత మాత ఆలయం మరియు శ్రీ కోట మైసమ్మ దేవాలయం వర్కింగ్ ప్రెసిడెంట్ కె.ఎస్. ఆనంద్ రావు నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ శ్రీ సి.వి. ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ సందర్భంగా ఆలయ బ్రోచర్ను ఆయనకు అందజేసి, ఈ నెల 9వ తేదీన ఆలయంలో వైభవంగా నిర్వహించనున్న బోనాల పండుగ మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ క్రమంలో యన్. శ్రవణ్ కుమార్, ఎ.కోటి రెడ్డి, ఎం. సుజీత్ వర్మ, పి.సుమన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

