• Sun. May 10th, 2026

అక్షర న్యూస్ : గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన…

Bypentam swamy

Oct 20, 2024

అక్షర న్యూస్ : అక్టోబరు 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. అయితే, ఈ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తీర్పు వచ్చే వరకు గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

అయితే, ప్రభుత్వం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండగా, గ్రూప్-1 అభ్యర్థులు హైదరాబాదులో అశోక్ నగర్ లో ఇప్పటికే ఆందోళన కూడా చేపట్టారు. వారికి బండి సంజయ్, హరీశ్ రావు వంటి విపక్ష నేతలు కూడా మద్దతు పలికారు.

అక్షర న్యూస్ : బీడీ టేకేదారుల కమిషన్ పెంపు.. వెయ్యి బీడీలకు రూ. 28.60గా నిర్ణయం..

తాజాగా, అశోక్ నగర్ లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రూప్-1 అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో, విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడ్నించి తరలించారు.

అక్షర న్యూస్ : కోహెడలో ‘మన పోలీస్ – మన ఊరు’: ప్రజల మధ్యకు సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాల్