అక్షర న్యూస్:-సిద్దిపేటకు నూతనంగా విచ్చేసినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ విజయకుమార్ గారిని టిఎన్జీవో సిద్దిపేట పక్షాన ఈరోజు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఉద్యోగులకు ఏమైనా ఇబ్బంది ఉంటే తన దగ్గరికి రావాలని ఉద్యోగాలు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని ,సిద్దిపేట జిల్లాను తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి, సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సుద్దాల కృష్ణమూర్తి ,మామిడాల రామ్మోహన్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు చెవిటి నగేష్, కార్యదర్శి సుమన్ ,ఉపాధ్యక్షులు మహేష్ లు పాల్గొన్నారు..

