• Thu. Mar 12th, 2026

అక్షర న్యూస్ : పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి..

Bypentam swamy

Jan 7, 2025

అక్షర న్యూస్ :దుబ్బాక శాశనసభ నియోజకవర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్నా ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణాలను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తో కలిసి దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ కెనాల్స్ నిర్మాణం, భూసేకరణ పై ఇరిగేషన్, రెవిన్యూ, ఫారెస్ట్ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు మరియు ఇతర మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణ పెండింగ్ సమస్యలను త్వరగా పరిష్కరించి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.

అక్షర న్యూస్ : హయత్ రెస్టారెంట్ కి 15000/- జరిమానా విధించడం జరిగింది..

అలాగే కాల్వల నిర్మాణానికి అవుసరమైన పెండింగ్ లో ఉన్న భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ఇరిగేషన్,రెవిన్యూ, పోలీస్, సర్యే అధికారులు చెరువులను పరిశీలించి చెరువశిఖంలో పంటలు వేయకుండా చూడాలన్నారు.

అనంతరం విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దుబ్బాక నియోజకవర్గంలో వంగిన కరంట్ పోల్స్, వంగిన వైర్స్, చెడిపోయిన ట్రాన్సఫర్మర్స్ ను పరిశీలించి సరిచేయాలన్నారు.

ఈ సందర్బంగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం పై ఆధారపడి ఉన్నదని నియోజకవర్గంలోని రైతులకు ఇబ్బంది కలుగకుండా సాగునీరు సరఫరా చెయ్యాలని అదేవిదంగా రైతులకు మరియు ప్రజలకు ఇబ్బంది కలుగకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి మరియు విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు, గ్రామపంచాయతీలకు మరియు గృహలకు అందించాలని అన్నారు.

అక్షర న్యూస్ : పదవి విరమణ చేసిన తెలుగు పండితులు శ్రీ పి కనకరాజ్…

ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, కాళేశ్వరం ప్రాజెక్టు యూనిట్ 1 స్పెషల్ డిప్యుటీ కలెక్టర్ గీత, ఇరిగేషన్ ఇఇ నారాయణ, ఎస్ఇ ఎలక్ట్రీసిటీ చంద్రమోహన్, డిఇ లు, ఏఇ లు తదితరులు పాల్గొన్నారు.