అక్షర న్యూస్ :తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ గా గద్దర్ బిడ్డ వెన్నెల ఎన్నికైనందున ఉద్యమ నిరుద్యోగ కళాకారులందరూ కలిసి గద్దర్ వెన్నెలను ఈ నెల 4న రవీంద్ర భారతి లో సన్మానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు తెలిపారు.
జిల్లా కళాకారులందరూ వెన్నెలక్క సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళా ప్రసాద్, బండకాడ గణేష్, భుజంగం, కుంచం శ్రీనివాస్,యాదవ్ ఇనుప సురేష్, సుంచు బిక్షపతి, కందికట్ల రాజు, బెజుగామ నర్సింలు, వెంకటయ్య, ఐరేని రేణుక తదితరులు పాల్గొన్నారు.



