అక్షర న్యూస్ : శనివారం సాయంత్రం కొండపాక మండల పరిధిలోని రాజివ్ రహదారి ప్రక్కన గల మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతులు అభివృద్ధి శాఖ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల(గొల్లపల్లి)ను జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి ఆకస్మికంగా సందర్శించారు.
ఈ గురుకులం భవనం అద్దె భవనంలో నిర్వహిస్తున్నట్లు ఇందులో 500 మంది విద్యార్థులు చదువుతున్నట్లు ప్రిన్సిపల్ కలెక్టర్ కి తెలిపారు.
కిచెన్ షెడ్ ను పరిశీలించారు. కిచెన్ కూరగాయలను మరియు స్టోర్ గదిలో బియ్యం పప్పులు ఇతర వంట సామాగ్రి పాడవకుండా సెప్టి మెదడ్స్ పాటించాలని సూచించారు. కాలం చెల్లిన సరుకులు మరియు బియ్యం నాణ్యత లో ఎలాంటి రాజి పడవద్దని తెలిపారు. ఎట్టి పరిస్థితిలో మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అలాగే విద్యార్థులకు రుచికరంగా వండాలని సిబ్బందికి తెలిపారు.
సాయంత్రం స్నాక్స్ లో భాగంగా అటుకులను రూచి చుశారు. అన్నం కూరగాయలు మరియు మెను ప్రకారం మంసాహరం కూడా అందించాలని తెలిపారు. వంటలో ఎలాంటి పోరపాట్లు రాకుండా వంట సిబ్బందికి విద్యార్థులకు భోజనం మరియు చదువు విషయంలో ఎలాంటి చిన్న సమస్య ఎదురైన వెంటనే పరిష్కారించాలని ప్రిన్సిపాల్ ఇతర అధికారులను ఆదేశించా
రు.



