అక్షర న్యూస్ : శిక్షణ పూర్తి చేసుకుని నూతనంగా జిల్లాకు వచ్చిన 5 మంది ప్రొబిషనరీ ఎస్ఐలు ఈరోజు మర్యాదపూర్వకంగా సిపి మేడమ్ గారిని కలిసి మొక్కను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడం గారు మాట్లాడుతూ ఎస్ఐ ఉద్యోగం సాధించి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చినందుకు అభినందించారు. ప్రొబిషనరీ ఎస్ఐలకు ఒక నెల రోజుల శిక్షణ గురించి దుబ్బాక, అక్కన్నపేట, దౌల్తాబాద్, మద్దూర్, జగదేవపూర్ పోలీస్ స్టేషన్లకు కేటాయించడం జరిగిందన్నారు.
పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని, నీతి నిజాయితీగా విధులు నిర్వహించి డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని తెలిపారు విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించవద్దన్నారు. అలసత్వం వహించే వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రొబిషనరీ ఎస్ఐల వివరాలు..
1 కే మానస
2 పి రేణుక
3 వీ నవీన్
4 బి సౌజన్య
5 ఏ సమత.



