• Fri. Dec 12th, 2025

అక్షర న్యూస్ : హైదరాబాద్‌‌ చేరుకున్న రాష్ట్రపతి..

Bypentam swamy

Nov 21, 2024

అక్షర న్యూస్ :రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒక రోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.

వీరితోపాటు మంత్రులు సీతక్క, పొన్నం, నగర మేయర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి శామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నినవాసానికి చెరుకుని అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రాభించనున్నారు.ద్రౌపది ముర్ము పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్ర్టాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభిం చనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్‌ ఇన్‌ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర సర్కార్ నామినేట్‌ చేసింది.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..

రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ముర్ము వెంట సీతక్క ఉండనున్నారు.