• Thu. Mar 12th, 2026

అక్షర న్యూస్ : గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..

Bypentam swamy

Nov 16, 2024

అక్షర న్యూస్ :గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే పోలీస్ అధికారులకు పటిష్టమైన బందోబస్తు గురించి కమిషనర్ కార్యాలయంలో దిశా నిర్దేశం చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ.

సిద్దిపేట పట్టణంలో 37 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.బయోమెట్రిక్ సిస్టంతో పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.పరీక్ష కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.గ్రూప్- III రాత పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు చేసినట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించే అధికారులు సిబ్బంది ఉదయం 6 గంటలకు హాజరులో ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా పరీక్షా కేంద్రాన్ని వదిలి బయటకు వెళ్ళవద్దు, పరీక్ష కేంద్రం లోనికి ఎవరు కూడా సెల్ ఫోన్స్ తీసుకుని వెళ్లడానికి అనుమతి లేదు. 

అక్షర న్యూస్ : హయత్ రెస్టారెంట్ కి 15000/- జరిమానా విధించడం జరిగింది..

ప్రతి ఒక్క అభ్యర్థిని స్క్రీన్ చేసి లోపలికి పంపించాలి, విధినిర్వహణకు వచ్చే ఇతర డిపార్ట్మెంట్ అధికారులు మరియు సిబ్బందితో మరియు పరీక్షలు రాయడానికి వచ్చిన అభ్యర్థులతో మర్యాదగా ప్రవర్తించాలి, బందోబస్తు విషయంలో ఏవైనా సమస్యలు ఉంటే ఎగ్జామ్స్ పోలీస్ నోడల్ అధికారి ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ గారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.

 

 

అక్షర న్యూస్ : పదవి విరమణ చేసిన తెలుగు పండితులు శ్రీ పి కనకరాజ్…