అక్షర న్యూస్ :మహిళల భద్రతకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అందుకోసం ప్రత్యేకంగా షి,టీమ్స్ సైతం ఏర్పాటు చేసింది,మహిళలు, బాలికలు,విద్యార్థినులు తరచూ వేధింపులకు పాల్పడే ప్రాంతాలను హాట్ స్పాట్ గా గుర్తించి భద్రత కల్పిస్తున్నది.
దీనిలో భాగంగా రామ గుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ సోమవారం రామగుండం కమీషనరేట్ పోలీసు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉమెన్ సేప్టీ వింగ్ వారిచే రామ గుండం పోలీస్ కమీషనరేట్ షీ టీమ్ విభాగానికి జారీ చేయబడిన…
టీ-జింగ్, ర్యాగింగ్, వర్క్ ప్లేస్ హరస్మెంట్, సోషల్ మీడియా హరస్మెంట్, తల్లితండ్రులు పిల్లలపై దృష్టి అవగాహన సంబంధించిన పోస్టర్లను రామగుండం పోలీస్ కమీషనర్ ఎం.శ్రీనివాస్ ఇతర అధికారులు, షీ టీ-మ్ సిబ్బంది తో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… ఎవరైనా మిమ్మల్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులకు, లైంగిక వేధింపులకు గురిచేసినా, మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసినా, మీరు పని చేస్తున్న ప్రదేశంలో ఎవరైనా మీ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించి నా వెంటనే షీటిమ్స్ వారిని సంప్రదిం చాలని సూచించారు.
మీరు పని చేసే ప్రదేశాలలో స్వేచ్ఛగా, సురక్షితంగా పనిచేయడం ఒక మహిళ హక్కు అన్నారు. పిల్లల విద్యార్ధినిల యువతుల, మహిళల రక్షణ ప్రధాన లక్ష్యం అని మీరు ఎవరివలనైనా ఇబ్బందికి గురైతే భయపడవద్దని, ధైర్యంగా ఉండాలన్నారు.
ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే డయల్ 100, స్థానిక పోలీస్ అధికా రులను, రామగుండం పోలీస్ కమీషనరేట్ షీ టీ-మ్స్ వాట్సాప్ 6303923700, ఫేస్బుక్, షీ టీమ్ రామగుండం ట్విట్టర్, షీటీమ్ ఆర్ఎండీ ఇన్స్టాగ్రామ్ల ద్వారా సంప్రదించాలన్నారు.


