• Sun. Dec 14th, 2025

అక్షర న్యూస్ : ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 77 ఫిర్యాదులు..

Bypentam swamy

Nov 11, 2024

అక్షర న్యూస్ :ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు అధిక ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను జిల్లా కలెక్టర్ స్వీకరించారు.

అక్షర న్యూస్: 63వ జాతీయ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

అక్షర న్యూస్: పాలమాకుల గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి..

కాగా ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 77 ఫిర్యాదులు, వాటిని వెంటనే సంబంధిత అధికారులను పరిష్కరించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.