బ్రేకింగ్ న్యూస్
అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..అక్షర న్యూస్ : రిజర్వేషన్ కోచ్‌లలో అక్రమ ప్రవేశాలపై దక్షిణ మధ్య రైల్వే ఉక్కుపాదం: రూ. 2,000 వరకు ఫైన్!అక్షర న్యూస్ : డీజీపీ సి.వి. ఆనంద్‌కు బోనాల పండుగ ఆహ్వాన పత్రిక అందజేత..అక్షర న్యూస్ : 100 ఎకరాల్లో మరో ఆర్టీసీ డిపో!..అక్షర న్యూస్ : నవోదయకు దరఖాస్తు గడువు పొడిగింపు..అక్షర న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ 40 మంది వాహనదారులు రూ. 4,05,500/- జరిమానా..అక్షర న్యూస్ : నగర వాసులకు త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి: మంత్రి పొన్న ప్రభాకర్!..అక్షర న్యూస్ : లాల్ బజార్ లో జన జాతర..పూనకాలతో ఊగిపోయిన శివసత్తులు…అక్షర న్యూస్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే పూజిద్దాం: జై గణేశ భక్తి సమితి సభ్యుడు పెంటం స్వామి పిలుపు..అక్షర న్యూస్ : మంథని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి రామ్మూర్తి ని వరించేనా?
తెలంగాణ

అక్షర న్యూస్ : వృద్ద తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకులకు కౌన్సిలింగ్..

అక్షర న్యూస్ : వృద్ద తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకులకు కౌన్సిలింగ్..

అక్షర న్యూస్ : సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట త్రీ టౌన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన పాముకుంటా నర్సయ్య – ఎల్లవ్వ దంపతులు తమ ముగ్గురు కుమారులు యాదగిరి, కిష్టయ్య, దేవయ్యలకు తమ కష్టార్జిత ఆస్తులను సమానంగా పంచి ఇచ్చినప్పటికీ, సరైన పోషణ పొందడం లేదని 18-03-2026 నాడు సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై స్పందించిన సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టాటా లక్ష్మీబాబు ఈరోజు తేదీ 25-03-2026 నాడు ముగ్గురు కుమారులు మరియు వారి భార్యలను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. సమాజంలో వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ ప్రతి కుమారుని ప్రాథమిక బాధ్యత అని, తల్లిదండ్రులు తమ పిల్లల కోసం చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, వారిని వృద్ధాప్యంలో ఆదరించడం, పోషణ ఇవ్వడం, ఆరోగ్య సంరక్షణ చూడడం కుమారుల కర్తవ్యమని వివరించారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం నైతికంగా తప్పే కాకుండా చట్టపరంగాను శిక్ష అర్హులని హెచ్చరించారు. కౌన్సిలింగ్ అనంతరం కుమారులు తమ తల్లిదండ్రులను ఇకపై సక్రమంగా చూసుకుంటామని, ప్రతి నెల ఖర్చులకు సరైన డబ్బులను అందిస్తామని, అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చినపుడు అందరూ కలిసి వైద్యసహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా స్టేషన్ ఇన్స్పెక్టర్ టాటా లక్ష్మీబాబు మాట్లాడుచు సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాధన రష్మి పెరుమాళ్ గారు వృద్ధుల గురించి ప్రత్యేక దృష్టి సారించినందున వృద్దులైన తల్లిదండ్రులను సరిగా చూసుకోని కొడుకుల గురించి ఫిర్యాదు చేస్తే వారికి కౌన్సిలింగ్ నిర్వహించబడునని, వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, ప్రతి కుటుంబం దీనిని కచ్చితంగా పాటించాలని, ప్రతి 15 రోజులకు ఒకసారి ఖమ్మంపల్లి గ్రామానికి స్వయంగా వెళ్లి వృద్ధ దంపతుల పరిస్థితిని పరిశీలిస్తానని తెల్పినారు.

అక్షర న్యూస్ : దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా కేసీఆర్..

ఇన్స్పెక్టర్ గారి జోక్యంతో కుటుంబ వివాదం సఖ్యతగా పరిష్కారమవడంతో వృద్ధ దంపతులు పాముకుంటా నర్సయ్య-ఎల్లవ్వలు పోలీసుల సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.