అక్షర న్యూస్ :తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం టీజీఈజేఏసీ (TGEJAC) చేపట్టిన న్యాయమైన డిమాండ్లను సాధించుకోవడానికి ఉపాధ్యాయ లోకమంతా ఏకతాటిపైకి రావాలని టీపీటీఎఫ్ (TPTF) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం దుబ్బాక పట్టణంలో నిర్వహించిన ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, ఉపాధ్యాయులు, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. టీజీఈజేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటం కేవలం డిమాండ్ల కోసమే కాదని, ఉపాధ్యాయుల ఆత్మగౌరవ పోరాటమని ఆయన అన్నారు. పెండింగ్లో ఉన్న నూతన వేతన సవరణ సంఘం (PRC) నివేదికను వెంటనే బహిర్గతం చేసి, సవరించిన జీతాలను అమలు చేయాలి.సుదీర్ఘ కాలంగా బకాయి ఉన్న కరువు భత్యం (DA) వాయిదాలను తక్షణమే ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేయాలి. సుదీర్ఘ కాలంగా నిలిచిపోయిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా వెంటనే చేపట్టాలి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) తక్షణమే అమలు చేయాలి.ఈహెచ్ఎస్ (EHS) బలోపేతం చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయుల కోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు అందించేలా ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని (EHS) బలోపేతం చేయాలి.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టీజీఈజేఏసీ ప్రతిపాదించిన డిమాండ్లను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తిరుపతి రెడ్డి హెచ్చరించారు. కావున ఉపాధ్యాయులందరూ విధులకు హాజరవుతూనే, ఆగస్టు 27, 2026 న రాష్ట్రవ్యాప్త నిరసనలు, అలాగే సెప్టెంబర్ 10, 2026 న హైదరాబాద్లో మహ ధర్నా నిర్వహించడానికి TGEJAC కార్యాచరణను ప్రకటించింది. ఉపాధ్యాయ-ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో టీపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అమ్మన నర్సింహా రెడ్డి, మల్లేశం, జిల్లా కార్యదర్శి శివాజి utf నాయకులు శ్రీను, టీపీటీఫ్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, రాంచంద్రం, సంతోష్,లక్ష్మినారాయణ, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
అక్షర న్యూస్ : ఉపాధ్యాయ-ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను సాధించుకుందాం: టీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జి.తిరుపతి రెడ్డి…
